![Chandrababu vs jagan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/06/1086437-chandrababu-naiduys-jagan.webp)
Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలసి ఆయనను సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశించి పలువురు నేతలు కీలక నేతలు మాట్లాడారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ కౌరవ సభ నుంచి గౌరవసభగా మారిందని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఇక మీదట జరగనిచ్చే ప్రసక్తే లేదని ప్రస్తుత అధికార పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యులు ఇదే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. గతంలో వినిపించిన భాష, ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదని నిర్ణయించారు. దానికి అందరూ అంగీకరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా గౌరవసభ నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చారు.
అంటే వైసీపీకి చెందిన పదకొండుమంది ఎమ్మెల్యేలు.. జగన్ తో సహా అందరూ సభకు వస్తే.. వారెవరికీ గతంలో వారు చేసిన వ్యవహారాలకు ప్రతీకారంగా అవమానాలు చేసే కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేశారు. సభలో ఉన్నంత కాలం ప్రజా సమస్యలపైనే చర్చిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై చర్చ జరుగుతుంది కాబట్టి.. తమ వాదన వినిపించుకునేందుకు వైసీపీ నేతలు కూడా ధైర్యంగా సభకు రావొచ్చని పిలుపు నిచ్చారు. అయితే అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న దానిపై జగన్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్లిపోయిన ఆయన తీరు చూస్తే .. ఆయన ఈ ఐదేళ్లు సభకు వస్తారని భావించడం లేదు. కానీ ఆయన రావాలని అందరూ కోరుకుంటున్నారు. వాళ్లు వ్యవహరించినట్లుగా వ్యవహరించబోమని చెబుతున్నారు.