Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. బ్లాక్ బాస్టర్.. లేదంటే అట్టర్ ప్లాఫ్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నా.. ‘కిక్’తో భారీ సక్సెస్ అందుకున్నాడు. మహేశ్ బాబుతో సురేందర్ రెడ్డి తీసిన సినిమా ‘అతిథి’. ఈ మూవీ మహేశ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ మూవీలోని కొన్ని రోల్స్ ఆడియెన్స్కు గుర్తున్నాయి. అందులో హీరోయిన్ చెల్లెలు పాత్ర ఒకటి.
ఆ చిన్నారి పేరు కర్మన్ సింధు. అతిథి తనకు ఫస్ట్ మూవీ. మొదటి సినిమానే అయినా ఎలాంటి కెమెరా ఫియర్ లేకుండా.. ఎంతో బాగా నటించి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కర్మన్ సింధు. మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ను క్యారీ చేసింది. తాను కూడా మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. క్లైమాక్స్లో సింధూ పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులను ఊసూరుమనిస్తుంది. తెలుగు సినిమాల్లో శాడ్ ఎండింగ్ ను ప్రేక్షకులు అంతగా ఒప్పుకోరు. అయినా సురేందర్ రెడ్డి ఈ సినిమాలో రిస్క్ చేశాడు.. ఫలితం తేడా కొట్టింది. అతిథి తర్వాత సింధు మరో మూవీ చేయలేదు. ఆమెకు సినిమా ఇండస్ట్రీపై ఇంట్రస్ట్ లేదట.
కాగా ఇప్పుడు సింధు ఏం చేస్తోంది? ఎలా ఉంది? అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారట. కర్మన్ సంధు కెరీర్ కౌన్సెలింగ్, గైడెన్స్, అసెస్మెంట్లో కాన్సిలర్గా కొనసాగుతోంది. ఆమె ఇటీవలి ఫొటోలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం.
Breaking News