![Alluri District](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-1-7.jpg)
Alluri District : అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి ఆయన ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. పెదబాయలు మండలంలోను కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మతో వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలుగలేదు. 2005లో అప్పలమ్మను వివాహం చేసుకోగా ఆమెకు 2007లో ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత పిల్లలు కలుగలేదు.
ఈ నేపథ్యంలో ఇద్దరు భార్యల అనుమతితో మరో పెళ్లికి సిద్దమయ్యాడు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు కొట్టించి, బ్యానర్లు వేయించారు. కించూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు బంధు మిత్రులు, గ్రామ పెద్దలు అంతా హాజరయ్యారు. ఈ పెళ్లి పత్రిక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.