![Suryakumar Yadav](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/Untitled-design-2024-06-30T142309.889.jpg)
Suryakumar Yadav : సూర్య కుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి చేసిన పనికి నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు ఫిదా అవుతున్నారు. జూన్ 29 న జరిగిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా గెలిచి 13 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. ఫైనల్లో గెలవడంతో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. క్రికెట్ ప్రేమికులతో పాటు ప్లేయర్లు కూడా గ్రౌండ్ లో ఆనందంతో చిందేశారు.
క్రికెట్ అంటే ఎంత మక్కువ ఉందో సూర్య కుమార్ యాదవ్ ఫ్యామిలీ చూపించింది. సూర్య మ్యాచ్ గెలిచిన అనంతరం రోజు టీం రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్ పై ఐసీసీ వరల్డ్ కప్ ట్రోపీని పెట్టుకుని నిద్రపోయాడు. ఒక పక్క భార్య దేవిషా శెట్టి ఇటు పక్క సూర్య నిద్రపోతున్నట్లు మధ్యలో ట్రోపీని పెట్టుకుని ఉండడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
జీవితంలో కలలు కంటాం. వాటిని నిజం చేసుకున్న పోయే నిద్ర చరిత్రలో మరిచిపోలేనిది. అదే చేశాడు సూర్య కుమార్ యాదవ్. వరల్డ్ కప్ ట్రోపీని పక్కన పెట్టుకుని నిద్రపోతు ఎంజాయ్ చేస్తున్న సూర్యను చూసి క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు. సూర్య బాయ్ నువ్వు పట్టిన క్యాచ్ ఎలాంటిదంటే.. టైటిల్ ను ఇండియాకు తీసుకొచ్చిన క్యాచ్ అంటూ తెగ కొనియాడుతున్నారు.
చివరి ఓవర్ లో ఆరు బంతులకు 16 పరుగులు కావాల్సిన సమయంలో హర్దిక్ పాండ్యా బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ మొదటి బంతికే సిక్సు కొట్టాలని ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉన్న సూర్య పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోవడంతో బౌండరీ లైన్ దాటాడు. ఆ సమయంలో సూర్య బాల్ ను పైకి ఎగరేసి బౌండరీ లైన్ న దాటాడు. మళ్లీ ఇటు వైపు వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ ఔట్ కాగా.. మ్యాచ్ ఇండియా వైపు మొగ్గింది. దీంతో 13 ఏండ్ల భారత్ ట్రోపీ కల నెరవేరింది.