![Ayyannapatrudu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-7.jpg)
Ayyannapatrudu : ఏపీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటన చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ అయ్యన్నపాత్రుడిని స్పీకర్ ఛైర్ వద్దకు తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు.
అయ్యన్నపాత్రడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో ఉన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారన్న చంద్రబాబు.. విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు.