![Road Accident](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-3-7.jpg)
Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక హవేరిలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఫుణె-బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున నిలిపి ఉన్న లారీని టెంపో వెనుక నుంచి ఢీకొట్టింది.
గుండెనహళ్లి క్రాస్ దగ్గర పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని నిలిపి ఉంచారు. దాన్ని చూసుకోకుండా టెంపో వేగంగా వచ్చి వెనకాల నుంచి ఢీకొట్టింది. టెంపో వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాగా, రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునా సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.