![Airtel Tariffs](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-9-8.jpg)
Airtel Tariffs : టెలికాం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్ టెల్ కూడా ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్లపై టారిఫ్ లను 10-21 శాతం పెంచింది. దేశంలో టెలికాం కంపెనీలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ యూజర్ (ఏఆర్పీయూ) రూ.300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్ టెల్ పేర్కొంది.
పెంచిన మొబైల్ టారిఫ్ లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధర (రోజుకు 70 పైసలు) ఉండేలా చూశామనిటెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.