![Ex CM Hemant Soren](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-7-10.jpg)
Ex CM Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. అంచల్ భూ కుంభకోణం కేసులో ఆయనకు ఈరోజు (శుక్రవారం) హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చి రూ.600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని హేమంత్ సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదయింది.
ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి ఫిబ్రవరి 1, 2024న హేమంత్ సోరేన్ ను ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సహా 14 మంది అరెస్టు అయ్యారు.