BRS Ready To Campaign With NRI : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు కె. తారక రామారావు ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లోని ప్రతినిధులతో నేడు సమావేశం కానున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖల కోర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
నవంబర్ 30న పోలింగ్ నిర్వహిస్తున్నందున సోషల్ మీడియా కాంపెయిన్ పేరుతో కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నారైలు పర్యటించి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో 2018లో సైతం ఇలాగే ఎన్నారైల ప్రచారం మూలంగా పార్టీ విజయం సాధించింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఆ బాటలోనే పయనిస్తున్నారు.
52 దేశాల్లో ఉన్న ఎన్నారైల సాయంతో పార్టీ మరోమారు అధికారంలోకి రావాలని చూస్తోంది. దీనికి వారి సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వారిని ఉపయోగించుకుని ప్రచారం ముమ్మరం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే వారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. దీనికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఉందని ఎన్నారైలు చెప్పనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి కూడా వివరించనున్నారు. ఈ మేరకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ మూడోసారి విక్టరీ సాధించాలని అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.