36.9 C
India
Monday, May 13, 2024
More

    KCR Campaign in Kodangal : ‘రేవంత్ రెడ్డికి నీతి లేదు.. ఆయన సీఎం కావాలంటే ముందు అలా జరగాలి..’

    Date:

    KCR Campaign in Kodangal
    KCR Campaign in Kodangal

    KCR Campaign in Kodangal : తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. భారాస, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ తాజాగా కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డి నీతి లేని మనిషి అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ గౌరవం దిగజారిపోతుందని కేసీఆర్ అన్నారు.

    “నీతి లేని రేవంత్ రెడ్డికి కొడంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలి. నేనే సీఎం అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన సీఎం కావాలంటే ముందు కాంగ్రెస్ గెలవాలి కదా. రూ.50 లక్షలకు ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్ సత్యవంతుడిలా మాట్లాడుతున్నారు. కష్టపడి పని చేసే నరేందర్ రెడ్డిని కాదని, రేవంత్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ గౌరవం తగ్గిపోతుంది. ఎవరుంటే మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాల“ని కేసీఆర్ అన్నారు.

    తెలంగాణ ఉద్యమకారుల పైకి గతంలో రేవంత్ తుపాకీ పట్టుకుని వెళ్లారని, ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని, వ్యవసాయం చేసే తనకే రైతుల బాధలు తెలుసని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు చాలా మంది భూ కబ్జాదారులని, వారు అధికారంలోకి వస్తే “ధరణి“ని తీసేస్తామంటున్నారని కేసీఆర్ అన్నారు.

    Share post:

    More like this
    Related

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Polling Percentage : 9 గంటల వరకు 10.35 శాతం పోలింగ్

    Polling Percentage : దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల్లో...

    AP Govt : రుణాల వేటలో ఏపీ ప్రభుత్వం – రూ. 4 వేల కోట్ల అప్పుకు యత్నం

    AP Govt : పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ ఏపీ ప్రభుత్వం...

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ అనంత లోకాలకు – రైలు ఢీకొని తల్లీకుమారుడు మృతి

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ రైలు ఢీకొని అంగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...