-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి
సొమ్ము కేంద్రానికి.. సోకు జగన్ ది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆమె తూర్పారపట్టారు. అమరావతి… బిజెపి విధానాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి ప్రసార మాధ్యమాలు మంచి వేదికలు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉద్ఘాటించారు. మోడీ సర్కార్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం అధ్యక్షతన జరిగిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి లు, మీడియా ప్యానెలిస్టు ల తో నిర్వహించిన సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ చర్చా వేదిక ల్లో మంచి భాషను వినియోగిస్తునే ప్రత్యర్థి పార్టీల వాదనలు తిప్పి కొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలకు ఈ రాష్ట్రంలో ఎలా పేర్లు మార్చేస్తున్నారు అదేవిధంగా లేని పోని అభాండాలు కొన్ని పార్టీలు మనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టడానికి బిజెపి మీడియా ప్రతినిధులు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తెలియ చేయాలి అదేవిధంగా జీ20 వల్ల మనదేశ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఎన్ని జాతీయ విద్యాసంస్థలు వచ్చాయి, జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే ల అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం లో నే జరిగిందన్న విషయాలు ప్రసార మాధ్యమాలు ద్వారా తీసుకుని వెళ్ళాలని దిశా నిర్దేశం చేశారు