Lokesh యువరాజు నారా లోకేశ్ గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటుంది. బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ది ఒక తీరు అయితే సొంత పుత్రుడు లోకేశ్ ది మరో తీరు. ఇద్దరి వ్యవహారం చంద్రబాబుకు తలపోటును తీసుకువస్తుంది. ఇటీవల యువరాజు లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర చేశాడు. ఇది పార్టీకి కలిసిరాకపోగా తీవ్రంగా నష్టాన్ని తెచ్చిపెట్టిందనే టాక్ ఏపీలో ఉంది. తనకు వచ్చీరాని పదాలను మాట్లాడుతూ.. కొన్ని పదాలను మింగుతూ ఆయన ఇచ్చిన స్పీచ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పప్పును యువరాజును చేస్తే ఆంధ్రప్రదేశ్ గతి ఏంటంటూ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్న రోజుల్లో ఆచి తూచి మాట్లాడాలి గానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటని ప్రజలు, స్వయంగా టీడీపీ నాయకులే గగ్గోలు పెడుతున్నారు. వీటన్నింటికీ తోడు ఆయన రాసలీలల వీడియోలు, ఫొటోలు ఇవి కూడా ఆయనతో పాటు టీడీపీ ఇమేజ్ ను కూడా తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నాయన్న వార్తలు లేకపోలేదు.
యువరాజు నారా లోకేశ్ స్విమ్మింగ్ ఫూల్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఏపీ ప్రజలతో పాటు దేశం మొత్తం చూశారు. వీటిపై చాలా బహిరంగ సమావేశాల్లో మాట్లాడారు నారా లోకేశ్. మీ వద్ద ఫొటోలు, వీడియోలు లేకుంటే నన్ను అడిగితే నేనే పంపిస్తాను అంటూ చెప్పారు. దీంతో పాటు తన వాట్సప్ ఖాతాకు కూడా వస్తు్న్నాయని లోకేశ్ చెప్పుకచ్చాడు. ఒక సందర్భంలో తన భార్య నారా బ్రాహ్మిణి కూడా ఇవేంటని అడిగిందని వద్దు వాటి గురించి అని చెప్పానని చెప్పాడట. ఆయనే స్వయంగా చెప్పాడు. ‘తాజ్ హోటల్ బిట్లను కూడా పంపిస్తావా పప్పూ?’ అంటూ పొలిటికల్ పంచ్ ఖతాలో ట్వీట్ పెట్టారు. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
తాజ్ హోటల్ బిట్లు కూడా పంపిస్తావా పప్పూ? pic.twitter.com/PMy60h0RBX
— Political Punch (@PoliticalPunch9) July 23, 2023