![Yediyurappa](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-16-8.jpg)
Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోక్సో కేసుకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో ఆయనపై పోలీసులు గురువారం ఛార్జిషీట్ దాఖలు చేశారు.
17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను ఆయన బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) ఈ కేసు దర్యాప్తు చేస్తోంది.