Kuwait : గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు పహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది అస్వస్థతకు గురయ్యారు. కువైట్ లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో 160 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసేుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదం సంభవించిన భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు.
కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ప్రమాద స్థలానికి మన రాయబారి వెళ్లినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.