జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ దాదాపు పదేళ్లు అందులో తన కెరీర్ ను కొనసాగించింది. మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు వచ్చాక సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. రంగస్థలంలో రంగమ్మత్తగా పుష్పలో దాక్షాయణిగా నటించి మెప్పించింది. దీంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఇక జబర్దస్త్ కు గుడ్ బై చెప్పింది. ఇప్పుడు ఫుల్ టైం సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది.
సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. గతంలో థాయిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అందాలు ప్రదర్శిస్తూ ఫొటోలు పోస్టు చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీంతో ఆమె కూడా రియాక్ట్ అయింది. అభిమానులపై ఫైర్ అయింది. కానీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇప్పుడు పద్ధతి మార్చుకుంది. అమెరికా నుంచి తన కుటుంబంతో మంచిగా ఉన్న ఫొటోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమెలో వచ్చిన మార్పుకు అందరు సంతోషిస్తున్నారు. ఇలా సంప్రదాయ పద్ధతిలో ఫొటోలు పెడితే ఎవరైనా అంటారా? అన్ని అశ్లీల ఫొటోలు పెడితే అభిమానుల్లో ఆగ్రహం కలిగింది. అందుకే వారు ఎడాపెడా తిట్టారు. పద్ధతిగా ఉంటే ఎవరు కూడా ఏమనరు.
సినిమాల్లో అవకాశాల కోసం ఇటీవల చాలా మంది హీరోయిన్లు ఒళ్లు దాచుకోకుండా అందాలు ఆరబోస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు విసుగొస్తోంది. అందరు అదే పని చేస్తే ఆగ్రహం రాదా మరి. అందుకే అనసూయ అశ్లీల ఫొటోలకు వారు మాటల దాడికి దిగడం సహజమే. ఇప్పుడు ఆమెలో మార్పు రావడంతో సంతోషంగా కామెంట్లు పెడుతున్నారు.