![Italy](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-7-26.jpg)
Italy : ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం కింది భాగంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ కు సంబంధించిన వివాదాస్పద నినాదాలు రాశారు. జూన్ 14న ఇటలీలో జీ-7 సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కాగా, ప్రధాని పర్యటనకు ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది.
ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని ఇటలీ అధికారుల ఎదుట భారత్ లేవనెత్తిందని విదేశాంగ కార్యదర్శి క్వాత్రా తెలిపారు. విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు, ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని అత్యంత తక్కువ సమయంలోనే క్లీన్ చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే తరహాలో కెనడాలో గాంధీ విగ్రహం ధ్వంసమైంది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో యూనివర్సిటీ క్యాంపస్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ తీవ్రవాదులు ధ్వంసం చేశారు.