ఇది మామిడి పండ్ల సీజన్. దీంతో మామిడి పండ్లు తినేందుకు అందరు మొగ్గుచూపుతారు. చూడటానికి పసుపు పచ్చగా అందంగా కనిపించే మామిడిని తినేందుకు అందరు ఎంతో ఇష్టపడతారు. ఇందులో ఉండే పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. దీంతో వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ నేపథ్యంలో మామిడి పండ్లను తీసుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది.
ప్రస్తుత రోజుల్లో మామిడి పండ్లను రసాయనాలు వేసి పండిస్తున్నారు. దీని వల్ల మనకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు సహజంగా పండే పండ్లు ఎంతో బలం చేకూరుస్తాయి. రసాయనాలతో పండించే పండ్లతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందులో కలిపే ఇథనీన్ రసాయనం మనకు చెడు చేస్తుంది. అందుకే రసాయనాలతో పండిన పండ్ల కంటే సహజంగా పండిన పండ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
రసాయనాలతో పండించిన పండ్లను సులభంగా గుర్తించొచ్చు. వాటి ఆకారం, రంగు, చర్మం పరీక్షించడం ద్వారా పండ్లలో రసాయనాలు కలిపారో లేదో తెలుసుకోవచ్చు. పండు మీద నీలం, తెల్ల రంగు మచ్చలు ఉంటే అవి రసాయనాలు వాడినవని తెలుసుకోవాలి. వాటిని ఓసారి ఒత్తి చూస్తే గట్టిగా ఉంటే అది రసాయనాలు కలిపిందని కనిపెట్టాలి. ఇలా రసాయనాలు వాడిన పండ్లను తినడం సురక్షితం కాదు.
దీంతో మందులు వాడిన పండ్లను దూరంగా ఉంచాలి. సహజసిద్ధంగా పండిన పండ్లను మాత్రమే వాడాలి. లేదంటే మనకు ఎంతో నష్టం కలుగుతుంది. రసానిక ఉత్పత్తులతో మనకు పలు రోగాలు వ్యాపిస్తాయి. ఈ నేపథ్యంలో మామిడి పండ్లను తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని పండ్లు కొనుక్కోవాలి. రసాయనాలు వాడిన వాటిని తీసుకుంటే నష్టమే.