Nedurumalli Janardhana Reddy :
ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్ మారిపోయింది. అంతా స్వార్థంతోనే చూస్తున్నారు. ఎవరైతే నాకేంటి? నాకేం లాభం అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. గతంలో సామూహిక లాభం కోసం పనిచేసేవారు. అందరికి కావాల్సిన అవసరాల గురించి అడిగేవారు. కానీ ఇప్పుడు తన కోసమే ఏం ఇస్తారు? అని అడుగుతున్నారు. నేతలు కూడా అదే విధంగా అలవాటు చేస్తున్నారు. రైతుబంధు, దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు లాంటి వ్యక్తిగత పథకాలతో ప్రజలను సోమరులుగా మారుస్తున్నారు.
ఉచిత పథకాలతో మనదేశం కూడా మరో శ్రీలంక, పాకిస్తాన్ లా మారడం ఖాయం. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరు వినిపించుకోవడం లేదు. కానీ మన సొమ్ము మనకే పెడుతున్నారనే కనీస జ్ణానం కూడా జనానికి కరువైంది. దీంతో ఒకరిని మించి మరొకరు ఉచిత పథకాల వైపు చూస్తున్నారు. దీంతో మన ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం సహజమనే విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు.
దీనిపై మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో స్వార్థపూరిత ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఇది మన వినాశనానికే సంకేతం. ఉచిత పథకాల పేరుతో ప్రజలను దగా చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఫలహారంలా పంచిపెడుతున్నారు. దీంతో ఎవరు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా సుఖాలకు అలవాటు పడుతున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి. కానీ ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకోవడమే రాజకీయంగా మారింది. దీంతో ప్రజల్లో చులకన అయిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎవరేమైతే నాకేంటి నాకు కావాల్సింది అధికారమనే ధోరణిలోనే వెళ్తున్నారు. భవిష్యత్ లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరు సమాధానం చెబుతారు.