![NEET Investigation](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-17-3.jpg)
NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిసింది. బీహార్ లో చేపట్టిన దర్యాప్తులో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్ లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు సమాచారం రాగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చాయి. అయితే, తాజాగా బీహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు బయటపడింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సెట్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ ఇంజనీర్ కూడా ఉన్నాడు. పేపర్ లీక్ గ్యాంగ్ తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆ జూనియర్ ఇంజనీర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.