ఏం మాట్లాడిన చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచారని, ఆయన రాష్ర్టానికి ఏం చేయలేదని చెబుతారు. అన్ని సభల్లోనూ పాడిందే పాటగా మాట్లాడుతుంటారు. ఇక చంద్రబాబు సామాజిక వర్గంపై కూడా ఆయన లేని ద్వేషాన్ని తెచ్చుకొని అన్యాయం చేయడం మొదలుపెట్టారు. తాజాగా సోమవారం నగరి సభలోనూ ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటో చెప్పుకోకుండా, పొద్దస్తమానం చంద్రబాబును విమర్శించడానికే జగన్ సాకులు వెతుకుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట బటన్ నొక్కే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారని విమర్శలు మూటగట్టుకున్నారు.
అయితే చంద్రబాబు మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని పదే పదే జగన్ మాట్లాడుతున్నారు. కానీ వివేకాను చంపిందేవరో మాత్రం ఆయన మాట్లాడరు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యుడిగా పాల్గొంటే కూడా దానిని రాజకీయం చేశారు. ఓట్ల గల్లంతు అంశంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తే కూడా విమర్శలు చేశారు. తన పార్టీ ఎంపీలను పంపి తాను కూడా సీఈసీకి ఫిర్యాదు చేయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ఆయన పార్టీ నేతలు చేసిన ఆగడాలను ఇంకా ఏపీ ప్రజలు మర్చిపోలేదు. ఇంత జరుగుతున్నా ఆరోపణలన్నీ టీడీపీ పై వేస్తూ ఆయన కాలం గడుపుతున్నారు. ప్రజలకు అరకొరగా ఇస్తున్న సంక్షేమ పథకాలు తనను కచ్చితంగా గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారు. అయితే ఇటీవల జనం మూడ్ మారుతున్నట్లుగా ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో ఇక మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. దీన్ని చూస్తుంటే జనం మూడ్ చంద్రబాబు వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది.
ReplyForward
|