గత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని, 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిందని పేర్కొంటూ బీజేనీ నేత కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరపున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేసిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ/ఎమ్మెల్యే కోరల్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే సహ నిందితుడిగా ఉన్న రాహుల్ జూన్ 7న కోర్టులో హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.