Ponnam Prabhakar : హనుమకొండ ఆర్టీవో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనపై చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.
వెంటనే ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు బీ ఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్తో కరువు వచ్చిందంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
పంట నష్టం పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతు కూడా అందులో ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు మంత్రి అన్నారు.