![Rohit Sharma](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/rohith-sharma.jpg)
Rohit Sharma : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో టీం మేట్ పేరును మళ్లీ మరిచిపోయాడు. ఈ మ్యాచ్ లో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించగా.. 11 మందిలో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉన్నారని తెలిపాడు. ముగ్గురు ఫేస్ బౌలర్లతో పాటు హర్దిక్ పాండ్యా కూడా తుది జట్టులో ఉన్నాడని చెప్పాడు.
యశస్వి జైశ్వాల్, సంజు, కుల్దీప్ లను ఆడించాలని ఉన్నా చోటు లేదని మరో ప్లేయర్ కూడా డగౌట్ లో ఉన్నాడని అతడి పేరు చెప్పేందుకు ప్రయత్నించి అనదర్ ప్లేయర్ అని చెప్పి ముగించాడు. దీంతో జట్టులో ఉన్న 15 వ నెంబర్ ఆటగాడు ఎవరూ అని పరిశీలిస్తే యుజ్వేంద్ర చాహాల్ అని తెలుస్తోంది. చాహల్ పేరును మరిచిపోవడంపై రోహిత్ పై ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎంటన్నా ఇంత మతిమరుపు అయితే ఎట్లా అన్న అని అంటున్నారు.
గతంలో కూడా రోహిత్ శర్మ టాస్ సమయంలో కూడా మరిచిపోయాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలో.. బ్యాటింగ్ తీసుకోవాలో తెలియక తికమక పడ్డాడు. జట్టు డ్రెస్సింగ్ రూంలో కూడా ప్రతిదీ మరిచిపోతుండని టీం సభ్యుల ఆరోపణ.
రోహిత్ శర్మ గురించి విరాట్ కొహ్లి కపిల్ శర్మ షో లో గతంలో కొన్ని విషయాలు పంచుకున్నాడు. రోహిత్ కడే కడే సోతా హై అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. నిల్చొని కూడా నిద్రపోగల వ్యక్తి రోహిత్ అన్నాడు. పాస్ పోర్టును సైతం మర్చిపోతాడని చిన్న చిన్న విషయాలకైతే లెక్క లేదని చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఈ విషయం బయటపడింది. అన్ని విషయాల్లో ఎలాగున్న ఐర్లాండ్ తో మ్యాచ్ లో కఠిన మైన పిచ్ పై హాప్ సెంచరీతో రాణించి మ్యాచ్ గెలిపించాడు.