Satires on Jagan & KCR :
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు అభివృద్ధిలో పోటీపడ్డాయి. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ నేతృత్వంలోని సర్కారు అధికారంలోకి రావడం తెలంగాణ వరంగా మారిందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణలోని అధికార పార్టీ నేతలు పదే పదే ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఇదే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుపునకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో సహకరించారు. తెలంగాణ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మరి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీలో జగన్ గెలుపునకు సర్వ శక్తులు ఒడ్డారు. అర్ధ, అంగబలాలను సమీకరించారు. ఇక ఆ తర్వాత ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒక కారణమయ్యారని ఏపీ ప్రజల్లో బలంగా ముద్ర పడింది.
ఇక ఈ అంశం నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతున్నది. జగన్, కేసీఆర్ మధ్య ఉన్న బంధాన్ని పోలుస్తూ సెటైరికల్ గా దీనిని తయారు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ తో అంటున్నట్లు ఉన్న మాటలను అందులో పొందుపరిచారు. ‘తమ్ముడు నువ్ త్యాగ జీవిరా.. నాకోసం అమరావతిని త్యాగం చేశావ్..రియల్ ఎస్టేట్ ను త్యాగం చేశావ్.. ఏపీ ఆస్తులు త్యాగం చేశావ్..ఇప్పుడు నీళ్లు త్యాగం చేస్తున్నవ్.. నీ రుణం తీర్చుకోలేనిది రా.. జన్మజన్మలకు నువ్వే నా తమ్ముడిగా ఉండాలి రా..’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.
తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. అది వారిద్దరి వ్యాపార సంబంధాలు అని భావించే వారు ఉన్నారు. 2019 తర్వాత ఏపీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని చాలామంది ప్రముఖులు వివిధ సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. గతంలలో ఏపీలో ఒక్క ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనొచ్చు అన్నట్లు పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది తారుమారైంది. తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు అన్నట్లు తయారైంది. ఇక పలు కంపెనీలు ఏపీని వదిలి తెలంగాణ గడప తొక్కుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తెలంగాణ సీఎం, ఏపీ సీఎంను అభినందించాల్సిందే. ఇక అతి పెద్ద అమరావతి ప్రాజెక్టును కూడా ఏపీ సీఎం జగన్ తన స్వార్థం కోసం తొక్కేశారని ముద్ర వేసుకున్నారు. తాజాగా కృష్ణా జలాల్లో వాటాను కూడా ఏపీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. కృష్ణ జలాల్లో వాటా కోల్పోతే ఇక రాయలసీమ ఎడారిలా మారే ప్రమాదం ఉందని తెలిసినా, ఏపీ సీఎం జగన్ అనుకున్న స్థాయిలో స్పందించకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.