Nyayaniki sankellu Program : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కుట్రపూరితంగా జైలులో వేసి వైసీపీ తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేసేందుకు టీడీపీ అన్ని మార్గాలను వాడుకుంటోంది. ఇప్పటికే పలు విధాలుగా బాబు అరెస్టును ఖండించారు. ధర్నాలు, రాస్తారోకోలు, చప్పట్లు వంటి మార్గాల్లో నిరసన తెలిపింది. దీనికి టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు.
ఈనేపథ్యంలో లోకేష్ భార్య నారా బ్రాహ్మణి న్యాయానికి సంకెళ్లు అనే నినాదంతో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు చేతులకు తాళ్లతోనో రిబ్బన్లతోనో సంకెళ్లు వేసుకోండి. బాల్కనీలు, వాకిళ్లు, వీధుల్లోకి వచ్చి చూపిస్తూ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది. న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బ్రాహ్మణి కోరుతోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం దిమ్మతిరిగి పోవాలని చెప్పింది. వైసీపీ నేతల దురుద్దేశాలకు మనం సరైన సమాధానం చెప్పాలని టీడీపీ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అందరు సహకరించాలి. న్యాయపోరాటంలో మాతో కలిసి రావాలని పిలుపునిచ్చింది.
ప్రస్తుతం టీడీపీలో బ్రాహ్మణి చురుకైన పాత్ర పోషిస్తోంది. పార్టీ వ్యవహారాలను చక్కబెడుతోంది. లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉంటే ఇక్కడ పార్టీ కార్యక్రమాలన్ని తానే చూసుకుంటోంది. బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పలు కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే న్యాయానికి సంకెళ్లు పేరుతో నేడు నిర్వహించే ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని ఆమె కోరుతోంది.
న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని వ్యవస్థలను నిలదీద్దాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘న్యాయానికి సంకెళ్ళు’ కార్యక్రమంలో పాల్గొందాం. ఈరోజు రాత్రి 7 గంటలకు మీ చేతులకు తాళ్లతోనో, రిబ్బన్లతోనో, సంకెళ్లు వేసుకోండి. ఇళ్ల నుంచి వాకిళ్లు , బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి ఆ… pic.twitter.com/UJIjrqMpj9
— Brahmani Nara (@brahmaninara) October 15, 2023