![T20 World Cup 2024](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/t20worldcup3-1718515052.jpg)
T20 World Cup 2024 : టీ 20 ప్రపంచ కప్ 2024 సూపర్ -8 లో చేరిన జట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఇక పోరు మాత్రమే మిగిలి ఉంది. భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ -1లో చేరగా, గ్రూప్ 2లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి సూపర్- 8 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అనూహ్యంగా సూపర్ -8లో చేరాయి. ఇప్పుడు సూపర్ 8లో అసలైన ఆటకు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్థాన్ లాంటి పెద్ద జట్టును అమెరికా ఓడించగా, ఆఫ్ఘనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. అయితే, చాలా మంది క్రికెట్ విశ్లేషకులు ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్కు చేరుతుందని అంచానా వేస్తున్నారు.
సెమీ ఫైనల్ లో ఫేవరెట్ గా భారత్
ఆఫ్ఘనిస్థాన్ సెమీఫైనల్ చేరితే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్ జట్లలో ఏదో ఒక జట్టు నిష్క్రమించడం ఖాయం. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ఆఫ్ఘనిస్తాన్ను సెమీ-ఫైనల్కు వెళ్తుందని తన అభిప్రాయానన్ని వెల్లడించారు. ఈ జట్టు గ్రూప్ దశలో పటిష్టమైన ఆటతీరుతో తన అంచనాను నిజం చేసిందని చెప్పుకొచ్చారు. చివరి నాలుగు జట్లలో ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా లేదా భారత్ను ఓడించాలి. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, ప్రపంచంలోని 10 మంది దిగ్గజ క్రికెటర్లు 4-4 సెమీ-ఫైనల్కు పోటీదారులను ప్రకటించారు.
ఆఫ్ఘనిస్తాన్పై లారా పందెం
అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, సునీల్ గవాస్కర్, ఎస్ శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, బ్రియాన్ లారా, పాల్ కాలింగ్వుడ్, క్రిస్ మోరిస్.. వీరంతా భారత్ను సెమీ-ఫైనల్కు చేరుతుందని నమ్ముతున్నారు. వారిలో 8 మంది ఇంగ్లండ్, ఏడుగురు ఆస్ట్రేలియాకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు. కాగా బ్రియాన్ లారా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. నలుగురు దక్షిణాఫ్రికాను ఫైనల్ 4కి కాంపిటేటర్ అని అభిప్రాయ పడుతున్నారు. నలుగురు మాజీ క్రికెటర్లు వెస్టిండీస్ను సెమీ ఫైనల్ కు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.