![Vinukonda News](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-8-10.jpg)
Vinukonda News : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్డు ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ (78), ఆయన సతీమణి యశోద (67), డ్రైవర్ మృతి చెందారు.
బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్ వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తీక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శర్మ, అనుపమల పరిస్థితి విషమంగా ఉందని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.