Rajamouli :
రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘బాహుబలి’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇది ఏ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఊహించని ఘనత.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ డిసెంబర్ లో ప్రారంభమవుతాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఫిలింనగర్ నుంచి మరో బజ్ వినిపిస్తోంది.
రాజమౌళి బంధువు ఎంఎం కీరవాణి ధార్మికమైన వ్యక్తి. అతను జ్యోతిష్యం, జాతకాలను బాగా నమ్ముతాడు. కీరవాణి ఎంతగానో నమ్మే కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు రాజమౌళికి ప్రస్తుత సమయం బాగా లేదని చెప్పినట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఆగస్ట్ వరకు మహేవ్ బాబు ప్రాజెక్ట్ ను మొదలు పెట్టవద్దని సలహా ఇచ్చాడు. రాజమౌళి సలహాకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంటే సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమా విడుదలైతే మహేశ్ బాబు కనీసం ఏడు నెలలు ఖాళీగా ఉంటాడన్నమాట.
అయితే రాజమౌళితో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఈ జాప్యం చాలా ఆశాజనకంగా ఉంది. హీరోలు సినిమా ద్వారా వచ్చే లాభాలను మాత్రమే తీసుకుంటారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ రూమర్స్ తో ఫిలింనగర్ హల్ చల్ చేస్తోంది.