![Uttar Pradesh](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/119535504_24a2fed7-0f1a-448f-91f6-1934a7cbe470.jpg)
Uttar Pradesh : కళ్యాణ వేదికపై పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగానే అందరిముందే వరుడు వధువును ముద్దు పెట్టుకోవడం ఘర్షణకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్ లోని అశోక్ నగర్ లో సోమవారం ఏర్పాటు చేశారు. ఒకరి వివాహం పూర్తయిన తరువాత మరొకరి వివాహం ప్రారంభించారు. వధూవరులు వరమాలలు వేసుకున్నతర్వాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. ఇది వధువు బంధువులకు నచ్చక పోవడంతో వరుడు, వరుడి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. వరుడి బంధువులు ప్రతిదాడికి దిగడంతో కళ్యాణ వేదిక కాస్త రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బహిరంగంగా దాడికి పాల్పడినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.