![Rohit Sharma](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/rohit-sharma-ind.jpg)
Rohit Sharma : రోహిత్ శర్మ తర్వాత టీం ఇండియా కెప్టెన్ గా ఎవరూ కాబోతున్నారనే చర్చ జోరందుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఓడిపోయింది. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పొట్టి ప్రపంచ కప్ పై భారత్ కన్నేసింది. అయితే దీనికి ముందుగా హర్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఎంపిక అవుతాడని అనుకున్నారు. కానీ హర్దిక్ ఫిట్ నెస్ లేక గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.
దీంతో మళ్లీ రోహిత్ నే టీ 20 వరల్డ్ కప్ కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే టీం ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ టీ 20 వరల్డ్ కప్ అందించాడు. వెంటనే రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇండియా కు ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. హర్దిక్ పాండ్యా నే కెప్టెన్ గా నియమిస్తారని అంటున్నారు. కొంతమంది జస్ ప్రీత్ బుమ్రా వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
జస్ ప్రీత్ బుమ్రా ఐర్లాండ్ తో సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించాడు. సక్సెస్ ఫుల్ గా పని పూర్తి చేశాడు. కానీ బుమ్రా కు కెప్టెన్సీ అప్పగిస్తే అతడి బౌలింగ్ దెబ్బతిని జట్టు కష్టాల్లో పడే అవకాశం ఉందని కొంతమంది క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు. రోహిత్ వారసుడిగా శుభ్ మన్ గిల్ అయితేనే సరైన వాడని భవిష్యత్తు ఇండియా క్రికెట్ కు సరిపోతాడని అంటున్నారు. అయితే టీం ఇండియాకు కెప్టెన్సీ గా వ్యవహరించడమంటే.. మామూలు విషయం కాదు ఒత్తిడితో కూడుకున్న అంశం.
శుభ్ మన్ గిల్ ఐపీఎల్ లో సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో టీ 20 ప్రపంచ కప్ 15 మంది జట్టు సభ్యుల్లో ఎంపిక కాలేదు. అయితే జింబాబ్వే తో జరిగే 5 టీ 20 మ్యాచులకు కెప్టెన్ గా నియమించారు. ఇందులో రాణిస్తే శుభ్ మన్ గిల్ టీం ఇండియాకు రెగ్యూలర్ కెప్టెన్ గా ఎంపిక కావడం ఖాయం.