![](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/123052484_a158deb7-b8c4-423f-a2c1-1c863b6a5b8a.jpg)
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న అప్రదిష్టను తొలగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పలు మార్గాలు వెతుకుతోంది. దీంతో దేశంలో జమిలి ఎన్నికలకు బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తేనే లాభం కలుగుతుందని భావించి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. అలా జరిగితేనే పార్టీల ప్రభావాన్ని అడ్డుకోవచ్చు.
పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రో మంటలు, గ్యాస్ ధరలు కేంద్రాన్ని ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. దీంతో సామాన్యుడి జీవితం ఎంతో దుర్భరంగా మారుతోంది. అందుకే ముందస్తుకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు వెళితేనే మంచిదనే అభిప్రాయం వెల్లడవుతుందని తెలుస్తోంది. మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది.
కేంద్రం తీరుపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చితే మొదటికే మోసం వస్తుందని గ్రహించింది. అందుకే జమిలి ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని ఆలోచిస్తోంది. దీని కోసమే సర్వశక్తులు ఒడ్డాలని అనుకుంటోంది. దక్షిణాదిలో పట్టుకోసం పాకులాడుతున్నా అనుకూల ఫలితాలు రావడం లేదు.
డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ముందే ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళితేనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండదు. దీనిపై పార్టీలోని నేతలంతా సమష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ముందస్తు ఎన్నికలు బీజేపీని గాడిన పడేస్తాయో లేక అగాధంలో పడేస్తాయో తెలియడం లేదు.