![T20 World Cup](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/virat-kohli-rohit-sharma.jpg)
T20 World Cup 2024 Final : టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనుంది. ఒకవైపు కోచ్గా కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఇదే చివరి మ్యాచ్ కానుండగా, మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి వారి కెరీర్లో చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కావచ్చని చర్చలు జరుగుతున్నాయి. టీ-20 ప్రపంచకప్కు ముందు నుంచే ఈ ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు భారత మేనేజ్మెంట్ భవిష్యత్తు దిశగా ఆలోచన చేస్తున్నది. జింబాబ్వేతో సిరీస్కు యువ జట్టు ఎంపిక కావడానికి ఇదే కారణం. ఇప్పుడు తదుపరి టీ-20 ప్రపంచకప్ 2026లో జరగనుంది. టీమ్ మేనేజ్మెంట్ అందుకు సిద్ధమవుతోంది. గొప్ప ఆటగాళ్ళు ఇద్దరూ ఆట మినీ క్రికెట్ ఫార్మాట్లో చిరస్మరణీయ వీడ్కోలు పొందాలని అభిమానులు ఆకాంక్షిస్తుంటారు. భారత జట్టు జెర్సీలో వీరిద్దరికీ ఇదే చివరి టీ20 మ్యాచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వచ్చే ప్రపంచకప్ 2026లో జరగనుంది. అప్పుడు 39 ఏళ్ల వయసులో రోహిత్, 38 ఏళ్ల వయసులో కోహ్లీ, అలాగే జడేజా కూడా ఈ ఫార్మాట్ ప్రకారం ఫిట్గా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఫైనల్ మ్యాచ్కు ముందు ఎవరూ రిటైర్మెంట్ గురించి మాట్లాడరు. కానీ శనివారం బార్బడోస్లో భారత్ను ఓడించినట్లయితే, కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఈ ఫార్మాట్లో సాధించడానికి ఏమీ ఉండదు. రిటైర్మెంట్ ప్రకటన వెంటనే ఉండకపోవచ్చు. కానీ వీరు ఐపీఎల్ మాత్రం ఆడే అవకాశాలు ఉన్నాయి.
గత నవంబర్లో భారత జట్టు వన్డే ప్రపంచకప్ను గెలుపొంది ఉంటే, బహుశా రోహిత్, కోహ్లీలో నిరాశ కనిపించేది కాదు. దీంతో వీరు రకమైన చిరస్మరణీయ ముగింపును కోరుకుంటున్నారు. దీంతో వారు టీ20 ప్రపంచకప్ను గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. ధోనీకి ఎంత పాపులారిటీ ఉందో టీమ్లో రోహిత్కి కూడా అంతే పాపులారిటీ ఉంది. జట్టు ఆటగాళ్లతో అతని అనుబంధం, కమ్యూనికేషన్ విషయంలో జూనియర్లకు ధోనీ ‘మహీ భాయ్’ అయితే కోహ్లీ మైదానంలో తన ఆటతీరుతో పాపులారిటీ సంపాదించాడు. కానీ రోహిత్ తన సహచరులతో పాటు జూనియర్ ఆటగాళ్లు కూడా చాలా ఇష్టపడతారు.
టీ20 ఇంటర్నేషనల్లో కోహ్లీ, రోహిత్!
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చివరి మ్యాచ్గా మారే అవకాశం ఉంది. ఈ పొట్టి ఫార్మాట్లో కూడా ఇద్దరు బ్యాట్స్మెన్ తమ ఆధిపత్యాన్ని సాధించారు. అంతర్జాతీయ టీ-20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రోహిత్, ఈ విషయంలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ, రోహిత్ల జోడీ కలిసి ఆడడాన్ని భారత అభిమానులు చూడడం ఇదే చివరిసారేమో.
8 వేలకు పైగా పరుగులు
టీ20ల్లో విరాట్ కోహ్లీ 4112 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 4222 పరుగులు చేశాడు. ఒకవైపు కోహ్లి ఒక సెంచరీ సాధించగా, మరోవైపు రోహిత్ 5 సెంచరీలు సాధించాడు. టీ-20 ఇంటర్నేషనల్లో ప్రత్యర్థి బౌలర్లకు కోహ్లీ, రోహిత్ జోడీ ఎప్పుడూ ప్రమాదకరమే.
8వ సారి ఐసీసీ ఫైనల్
కోహ్లి, రోహిత్ ఎనిమిదోసారి ఐసిసి ఫైనల్ ఆడబోతున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీరిద్దరూ ఏడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ ఆడారు. దీంతో ఇద్దరు ప్లేయర్లు యువరాజ్ సింగ్ ను అధిగమించ బోతున్నారు. యువరాజ్ సింగ్ తన కెరీర్లో 7 సార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ ఆడాడు.