Yuri Reddy Against Ramoji Rao : మార్గదర్శిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోంది. చిట్ ఫండ్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా గడుస్తోంది. మార్గదర్శిని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. అందులో ఎలాంటి లోటుపాట్లు లేకపోయినా నిరంతరం వేధింపులకు గురి చేయడం గమనార్హం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను చాలెంజ్ చేస్తూ యూరీ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శిలో తన పేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్గదర్శి కేసు విషయంలో కావాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు.
రామోజీ రావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి తన ఫిర్యాదులో చెప్పడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శిలో ఎలాంటి తప్పులు లేకున్నా జరుగుతున్నాయని వేధింపులకు గురి చేయడంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్గదర్శిలో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నా దానిపై లేనిపోని దుమారాలు లేపుతున్నారు.
వైసీపీ కుట్రపూరిత విధానాల వల్ల మార్గదర్శి ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఈనేపథ్యంలో స్వార్థపూరిత విధానాలతో సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కానీ అది అంత సులభం కాదని అర్థమవుతోంది. అందుకే కోర్టుల్లో సైతం ఎలాంటి ఆధారాలు లేకపోయినా కావాలని ఏవో సాకులు చూపుతోంది. మార్గదర్శిపై ఎన్ని కేసులు పెట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు.