తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తున్న హీరోలలో అడవి శేష్ ఒకరు. తాజాగా ఈ హీరో ఓ హైదరాబాద్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రకటించాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు ? అన్నది మాత్రం వెల్లడించలేదు.
ఎందుకంటే ఆమె పేరు వెల్లడించడానికి నాకు అనుమతి లేదు……. ఆమె అనుమతి తీసుకున్న తర్వాత ఆమె పేరు చెబుతాను అంటూ సదరు యువతికి గౌరవాన్ని ఇస్తున్నాడు. అయితే ప్రేమలో ఉన్న విషయం వెల్లడించినప్పుడు ఆమె పేరు చెబితే నష్టం ఏముంది అంటూ నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.
2002 లో సొంతం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అడవి శేష్ ఆ తర్వాత చాలాకాలం తర్వాత కర్మ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. 2011 లో వచ్చిన ” పంజా ” చిత్రంతోనే అడవి శేష్ కు గుర్తింపు లభించింది ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.
పంజా చిత్రంలో నెగెటివ్ క్యారెక్టర్ పోషించిన అడవి శేష్ చాలాకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కట్ చేస్తే ……. క్షణం , గూఢచారి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడేమో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ప్రొడక్షన్ హౌజ్ లో ఏకంగా ” మేజర్ ” అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు.