Adivi Sesh Meets Up CM Yogi Aditynath : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలుగు హీరో అడవి శేషును ఘనంగా సన్మానించారు. అదేంటి అడవి శేషు యూపీ సీఎంను కలవడమేంటి అనుకుంటున్నారా..? ఆదిత్యనాథ్ తెలుగు సినిమాలు చూస్తారని మీకు ఏమైనా అనుమానం వస్తున్నదా.. లేదండోయ్. నిరాడంబర జీవితం గడిపే యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అడవి శేషును తన నివాస గృహానికి పిలిపించుకున్నారు. ప్రస్తుతం దేశంలో భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు తెలుగు హీరోతో ఏం పని అనుకుంటున్నారా.. అయితే చదివేయండి
విషయం ఏంటంటే..
అడవి శేషు ఇటీవల మేజర్ అనే సినిమాలో నటించారు. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా లో విజయవంతమైంది. కాగా ఇదే సినిమాను ఇటీవల అన్ని భాషల్లో విడుదల చేశారు. మంచి టాక్ వచ్చింది. ఇది తెలుసుకున్న యూపీ సీఎం మేజర్ చిత్రబృందాన్ని తన వద్దకు పిలిపించుకున్నారు. ఒక సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా కావడంతో యోగి అభినందించారు. గొప్ప సినిమాను దేశానికి అందించారని కొనియాడారు. డైరెక్టర్, హీరో ను సత్కరించారు.
యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్య మంత్రి అయ్యాక యూపీ లో ఎన్నో మార్పులు చేస్తు్న్నారు. రౌడీయిజాన్ని కూకటి వేళ్లతో ఏరిపారేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో శక్తివంతమైన నాయకుల్లో యోగి ఆదిత్యనాథ్ టాప్ లో కొనసాగుతున్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు చేరువవుతున్నారు. ఆయన రెండో సారి అధికారంలోకి వచ్చారంటేనే ప్రజలకు ఆయనపై ఉన్న ఆదరణ తెలిసిపోతున్నది. అయితే ఇంత చక్కటి సినిమా తీసిన శేషును మన తెలుగు రాష్ర్టాల సీఎంలు గుర్తించకపోవడం సరికాదంటూ అభిమానుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.