ఆస్టిన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ఆస్టిన్ లో ఉంటున్న ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశాలకు ముఖ అతిథులుగా మాజీ ఎంపీ , సినీ నటుడు మురళీమోహన్ , టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లు హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని , ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే మన ముందున్న లక్ష్యమని అందుకోసం అందరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.