యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ ) అధ్యక్షుడు , అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) ఈరోజు మే 13 న మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ ఖలీఫా శుక్రవారం రోజున మరణించారు. షేక్ మరణంతో యూఏఈ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ కొనసాగనుంది. ఇక 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.
షేఖ్ ఖలీఫా 2014 నుండి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1948 లో పుట్టిన ఖలీఫా 2014 లో అనారోగ్యానికి గురయ్యాడు. ఇక అప్పటి నుండి కేవలం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మాత్రమే పాల్గొంటున్నారు. ఖలీఫా మరణంతో అతడి సోదరుడు మహమ్మద్ పాలనా వ్యవహారాలు చెక్కబెట్టనున్నారు.