Credit cards : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు నూతన విధానాలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే ఖాతాదారులకు లబ్ధి చేకూర్చే విధంగా శుభవార్త చెబుతోంది. ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుందో చూద్దాం.
ఇదివరకు బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులు ఒకే నెట్ వర్క్ తో ఉండేవి. ఇక మీదట జారీ చేసే క్రెడిట్ కార్డులకు మల్టీపుల్ నెట్ వర్క్స్ సిస్టమ్ తో ఇవ్వనున్నారు. దీంతో వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతానికి అందుబాటులో లేని ఈ ఆప్షన్ ను తర్వాత కాలంలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కార్డులను జారీచేసేటప్పుడు నెట్ వర్క్స్ సంస్థలతో అగ్రిమెంట్స్ చేసుకోకూడదు.
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్, సర్క్యులర్ ఇవ్వనుంది. ఆగస్టు 4 లోగా ప్రజల అభిప్రాయం అడుగుతోంది. ఖాతాదారుల అభిప్రాయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోనుంది. ఈ నిర్ణయం ఒకేసారి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేశాయి. మహారాష్ట్రలోని మల్కాపూర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు, మరొకటి కర్ణాటకలోని శుష్రుతి సౌహార్థ సహకార బ్యాంకులు.
ఈ బ్యాంకుల్లో మూలధనం లేకపోవడంతో లాభాలు లేకుండా పో యాయి. దీంతో ఆర్బీఐ ఈ బ్యాంకుల సేవలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాదారులకు క్రెడిట్ గ్యారంటీ స్కీం కిద డిపాజిట్ చేసిన వారికి రూ.5 లక్షల చొప్పున వస్తాయని పేర్కొంది.
ReplyForward
|