క్రెడిట్ కార్డు వాడుకున్నప్పుడు ఎక్స్ ట్రా 2 శాతం కట్ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు మన డబ్బుల్లో నుంచి ఎలాంటి రుసుం కట్ చేయరాదు. కానీ ఈ విషయం తెలియకపోవడంతో చాలా మంది అడగడం లేదు. వాళ్లు కట్ చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. కానీ దీన్ని ఎదిరించాలి. డబ్బులు కట్ చేయడంపై ప్రశ్నించాలి. డబ్బులు ఎక్స్ ట్రా తీసుకోవద్దనే విషయం తెలుసుకుంటే మంచిది.
జీఎస్టీ మనకు వర్తించదు. అది అమ్మే దుకాణాలకే వర్తిస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది మోసపోతున్నారు. ఎలాంటి ఎక్స్ ట్రా మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈనేపథ్యంలో మనం ఏ వస్తువు కొన్నా ఎలాంటి ఇతర డబ్బులు పే చేయాల్సిన పని ఉండదు. దానికి రిజర్వ్ బ్యాంకే స్పష్టమైన నిబంధనలు వెల్లడించింది. కానీ వ్యాపారులు మనల్ని బురిడీ కొట్టిస్తున్నారు.
జీఎస్టీ విషయంలో నియమ నిబంధనలు తెలుసుకుని నడుచుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. మనం కొనే వస్తువుల్లో 2 శాతం జీఎస్టీ కడితే మనకు బొక్క. అనవసరంగా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం? ప్రశ్నించి మనం కొనే వస్తువుకు ఉన్న ధర మాత్రమే చెల్లించాలి. అదనంగా ఎలాంటి డబ్బు చెల్లించకుండా చూసుకుంటే మంచిది.