Suicide : మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా చేసుకున్నారు.తమ పిల్లలను అమ్మగారు ఇంటికి పంపి , ఆత్మహత్యకు పాల్పడిన భార్య భర్తలు.సురేష్ స్వస్థలం లాలపేట్ , అతని భార్య భాగ్య అమ్మగారు మారెడ్ పల్లి ప్రాంతానికి చెందిన వారు కీసర లో స్థిరపడిన దంపతులు.సమాచారం అం దుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రెడిట్ కార్డు సంబందించిన అధికారులు ఇంటికి వచ్చి బిల్ కట్టమని ఇబ్బంది పెట్టడం తో స్థాని కంగా ఉన్న ఇరుగుపొరుగు వారి ముందు తమ పరువు పోయిందనీ మానసికంగా సురేష్ దంపతులు ఇబ్బంది పడ్డారు.తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యా చేసుకు న్నారు , తమ చావుకి కారణం క్రెడిట్ కార్డ్ అధికారులు అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టిన సురేష్ దంపతులు.