KCR : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశ ప్రజాస్వా మ్యా చరిత్రలో చీకటి రోజు అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధి కార బిజెపి వ్యవహరిస్తుం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘర్షణలు రుజువన్నారు. కేంద్రం ఈడి, సిబిఐ, ఐటీ వంటి సంస్థలను పావు లుగా వాడు కుంటుందని కేసీఆర్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన పాఠం చెబుతారని కేసీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు.