Viral Video : చేపలు స్వచ్ఛంగా దొరుకుతున్నాయి అనుకుంటే వాటిని కూడా రసాయనాలతో పెంచుతున్నారు. చేపలను పెంచేవారు వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. చెరువులలో ఉండే చేపలు వాటికి అవసరమైన ఆహారాన్ని అవే వెతుక్కుంటాయి. చేపలలో ఎక్కువ రకాలు సర్వభక్షకులు, అంటే అవి మాంసం, మొక్కల పదార్థాలను తింటాయి. చేపల ఆహారంలో దాదాపు 40% నుంచి 50% ప్రొటీన్లు ఉంటాయి. మిగిలిన భాగం కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ లతో కూడి ఉంటుంది.
అయితే చేపల పెంపకంలో సేంద్రీయేతర ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాంటీబయోటిక్స్ మరియు హానికరమైన రసాయనాలను ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు స్వచ్ఛం అని భావించేవారు వాటిని ఆహారంలో ఉపయోగించాలా? వద్దా? అని ఆలోచంచే పరిస్థితి ఏర్పడింది.