Vastu Tips : వాస్తు శాస్త్రంను భారత్ లో ఎక్కువగా నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో 7వ సంఖ్య శుభప్రదమైనది. సప్తఋషి, ఇంద్ర ధనస్సు లోని రంగులు ఏడు, సప్తపది అన్నీ పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో ఏవి ఉంటే ధనలక్ష్మి కటాక్షం ఉంటుందో తెలుసుకుందాం.
ఇంట్లో కదిలే గుర్రాల ఫొటోలు ఉంటే లక్ష్మి కటాక్షం ఉంటుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. కాబట్టి కదిలే గుర్రాలున్న ఫొటోలను ఇంట్లో తగిలించుకోవాలి. అందులో ఏడు అంకె శ్రేష్టం కాబట్టి ఏడు గుర్రాలు కదులుతున్న ఫొటోను ఇంట్లో గోడకు పెట్టుకుంటే మంచిది.
ఇంట్లో 7 తెలుగు రంగు గుర్రాలు కదిలే చిత్రాలను ఉంచడం శ్రేయస్కరం. ఎందుకంటే తెలుపు శాంతికి చిహ్నం. ఇది వ్యక్తి విజయం, అభివృద్ధిలో సాయం చేస్తుంది. ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉంటుంది.
పరిగెత్తే గుర్రం వేగానికి గుర్తు కాబట్టి ఈ చిత్రాన్ని ఇంట్లో ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఈ చిత్రాన్ని పదే పదే వీక్షించడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా లివింగ్ రూం లేదంటే స్టడీ రూం లేదంటే వర్క్ ప్లేస్లో ఉంచితే మంచింది.
ఇంటి తూర్పు దిక్కున ఏడు గుర్రాల బొమ్మను ఉంచడం వల్ల కెరీర్ వేగంగా వృద్ధి చెందుతుంది. స్తబ్ధత కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. పురోగతికి సహాయపడతాయి. అయితే, ఈ ఏడు గుర్రాల చిత్రాలను పడకగదిలో మాత్రం ఉంచద్దు.
కదిలో గుర్రాలను చూస్తే వేగం కండ్ల ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో పనులన్నీ సమయం లేదంటే సమయానికి ముందే జరుగుతాయి.