![Team India](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-14-7.jpg)
Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే, రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది. 13 ఏండ్ల ట్రోఫీ కల సాకారం చేసి ఐసీసీ టైటిళ్ల సంఖ్యను నాలుగుకు చేర్చింది. దాంతో సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే, రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.
ఫైనల్ మ్యాచ్ కు వేదికైన బార్బడోస్ కు తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ‘బెరిల్’ అనే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ నేపథ్యంలో బార్బడోస్ ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీంతో భారత జట్టు ఒకటి, రెండు రోజులు హోటల్ కే పరిమితం కానుంది. బార్బడోస్ లో కర్ఫ్యూ దృష్ట్యా టీం ఇండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది.