CM Revanth Reddy : శాసనమండలిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వాణిదేవి ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలు సభ్యుల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. సభా విలువలు కాపాడాలని కోరారు.