Big Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయింది. మొదటి వారమే ఎన్నో ట్విస్టులతో అలరించిన బిగ్ బాస్ చివరికి కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసాడు. ఇక ఇప్పుడు రెండవ వారం మరింత ఆసక్తిగా మారింది.. గత రెండు సీజన్స్ లలో బిగ్ బాస్ అలరించలేక పోవడంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు.
14 మంది కంటెస్టెంట్స్ తో మొదలయిన బిగ్ బాస్ లో ఎన్నో ట్విస్టులు, టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇక రెండవ వారం నామినేషన్స్ కూడా షురూ అయ్యాయి.. ఈ వారంలో అందరు కలిసి పల్లవి ప్రశాంత్ ను దారుణంగా ఆడుకున్నారు.. రైతు బిడ్డ పేరు చెప్పి సింపతీ గెయిన్ చేస్తున్నాడు అని ఎక్కువుగా రతికా చుట్టూనే తిరుగుతున్నాడు అని ఆరోపించారు.
యాక్టింగ్ చేస్తున్నావ్ అని అన్నందుకు శోభా శెట్టి ఇతడిపై విరుచుకు పడింది. ఇక రతికా రాజ్ కూడా ఇతగాడికి పెద్ద షాక్ ఇచ్చింది.. ఇన్ని రోజులు పల్లవి ప్రశాంత్ తో తిరిగి ఇప్పుడు ఎప్పుడు సరదాగా అతడితో గడిపి నవ్వించి, కవ్వించి ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చింది. నామినేషన్స్ సమయంలో ఒక్కసారిగా ఈ అమ్మడు ప్లేట్ తిప్పేసింది.
ఈ క్రమంలోనే నెటిజెన్స్ నుండి రతికాపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మొదటి నుండి ఇతడు తనతో క్లోజ్ గా ఉంటున్నాడని పులిహోర కలుపు తున్నాడు అని తెలుసు.. కానీ ఇన్ని రోజులు కవ్వించిన ఈ భామ ఇప్పుడు రివర్స్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ ను బకరాని చేసిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. రైతు బిడ్డగా ఇతడు ఎక్కడ టైటిల్ విన్నర్ అవుతాడో అని కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒకేసారి దాడి చేసారు..
అయితే వీరికి తెలియని విషయం ఏంటంటే వీరంతా కలిసి ఇతడిని పైకి లేపి జనాల్లో ఇతడి ఇమేజ్ పెంచేస్తున్నారు.. మరి నిజంగానే టైటిల్ విన్నర్ అయ్యే సత్తా ఇతడిలో ఉందా? ప్రేమలు, దోమలు అని కాకుండా గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..