Jagan Residence : మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి బయట కూల్చివేతలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే తెలంగాణలో ఒక మంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కూల్చివేతలు జరిగాయని చెబుతున్నారు. గతంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రి చెప్పడం వల్లనే ఈ కూల్చివేతలను చేపట్టారని తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఈ మంత్రి జోనల్ కమిషనర్ హేమంత్కు నేరుగా ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఈ పనికి పూనుకున్నారని సమాచారం.
తాజాగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూల్చివేతలు చేపట్టారు. జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. అయితే, ఈ కూల్చివేతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే, ఓ మంత్రి ప్రమేయంతోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.