BJP :
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిస్తోంది. రెండు చోట్ల బీజేపీ గెలిచి మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. త్రిపురలోని బాక్సానగర్, ధన్ పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రధాని మోడీ చరిష్మాతో దేశంలో మూడోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం సాధారణమే.
కేరళలోని పూతుపల్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జార్ఖండ్ లోని దుమ్రి, పశ్చిమ బెంగాల్ లోని ధూప్ గురి, ఉత్తరాఖండ్ లోని భాగేశ్వర్ లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి, ఎస్పీ ఒక చోట ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి.
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. దేశంలో బీజేపీ బలం నానాటికి పెరుగుతోంది. అదే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి మరింత ప్రోత్సాహం ఇవ్వనుంది. 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ హవా మరోసారి చూపించనుంది. బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో బీజేపీ హవా విస్తరిస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష ఇండియా అని కూటమి పెట్టుకున్నా దాంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.
భవిష్యత్ లో కూడా దాని ప్రభావం ముందుకు రాలేకపోతోంది. వారు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా వారిలో ఐక్యత కనిపించడం లేదు. దీంతో రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే సమర్థత వారిలో లేదు. అందుకే ఎన్ని కూటములు వచ్చినా బీజేపీని ఏం చేయలేవని తెలుస్తోంది. ఈ క్రమంలో బీజీపీ హవాకు ఎదురెళ్లే సత్తా ఉండదని చెబుతున్నారు.