IPL 2025 : ఐపీఎల్ ముగిసి వారం రోజులు కూడా కావడం లేదు. ఐపీఎల్ 2025 మెగా సీజన్ లో ప్లేయర్ల కొనుగోలు గురించి వార్తలు వస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ ఈ సారి రోహిత్ శర్మను వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. లక్నో సూపర్ గెయింట్స్ కూడా కేఎల్ రాహుల్ ను కూడా విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ సారి వేలంలోకి వచ్చే ప్లేయర్లపై అన్ని ప్రాంఛైజీలు+ కన్నేశాయి. ఐపీఎల్ 2022 నిబంధనల ప్రకారం.. నలుగురు ప్లేయర్లను టీంతోనే ఉంచుకోవచ్చు. మిగతా వారందరినీ వేలంలో తిరిగి కొనుగోలు చేసుకోవాలి. అయితే ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మను కాదని హర్దిక్ పాండ్యాను తెచ్చుకుని మరీ ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్సీ అప్పగించారు.
అయితే ముంబయి ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ, లక్నో నుంచి కేఏల్ రాహుల్ బయటకు వస్తే భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్, కేఏల్ రాహుల్ ను రాయల్ చాలెంజర్ బెంగళూరు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబయి జస్ ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ లను టీంతో కొనసాగించి రోహిత్ ను వదిలిపెట్టనుంది.
కేఎల్ రాహుల్ ను లక్నో విడిచిపెట్టి.. నూతన కెప్టెన్ ను తీసుకోవచ్చని తెలుస్తోంది. మార్కస్ స్టోనియిస్, డికాక్, పూరన్, బదోనిలను కొనసాగించనుంది. ఇటు బెంగళూరు విరాట్, విల్ జాక్స్, పటిదార్, సిరాజ్ లను అట్టి పెట్టుకోనుంది.
సన్ రైజర్స్ టీం హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ ను కొనసాగించవచ్చు. ఒక వేళ రోహిత్ శర్మను తీసుకోవాలనుకుంటే ప్యాట్ ను వేలంలోకి విడిచిపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసి మిగిలిన డబ్బులను రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఉపయోగించనున్నట్లు ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్యాట్ కమిన్స్ మరో సారి వేలంలోకి వచ్చి భారీ ధరకు అమ్ముడు పోవడం ఖాయం. వచ్చే సీజన్ మొత్తం రోహిత్, రాహుల్, ప్యాట్ కమిన్స్ చుట్టే తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.