![Deputy CM Pawan Kalyan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-12-10.jpg)
Deputy CM Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు నెల రోజులు కావొస్తుంది. ఈ సందర్బంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం చేపట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రొలు లో జరిగిన కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. తన శాఖలపై అధ్యయనానికి కాస్త సమయం తీసుకుంటున్నా.. ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయో ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు.
రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో కూడా ముందుకు దూసుకుపోవాలి. కానీ ఎక్కడా కూడా వైసీపీ పాలనలో అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదు. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులను వివిధ శాఖలకు ఉపయోగిస్తే కొన్ని అవసరాలైన తీరేవి. పంచాయతీ రాజ్ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. జీతం తీసుకోవాలన్ని మనసు ఒప్పుకోవడం లేదు. చుట్టు పక్కలా గోదావరి పారుతున్న తాగునీటికి ఇన్ని ఇబ్బందులు ఉండటం దురదృష్టకరం. ఒక్కో విభాగం గురించి మాట్లాడుకుంటే అన్ని అప్పులే కనిపిస్తున్నాయి. తవ్వే కొద్దీ అవినీతే బయటపడుతుంది.
పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే మోడల్ గా నిలపాలని కోరుకుంటున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి మార్గాలను చూపించాలని అనుకుంటున్నాం. విదేశాలకు వెళ్లానుకునే వారికి శిక్షణ ఇవ్వాలి. డబ్బులు సంపాదించుకోవడం, కొత్తగా పేరు తెచ్చుకోవడం కోసం కాదు.. నాకు మంచి పనులు చేసి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించడమే లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
క్యాంపు ఆఫీసులో మరమ్మతుల గురించి ప్రశ్నించగా.. ఇప్పుడు అవసరం లేదని చెప్పానని, అవసరమైతే సొంత నిధులతో ఫర్నీచర్ తెచ్చుకుంటానని చెప్పానని తెలిపాడు. మాకు ఓటేయకున్నా.. అర్హత ఉంటే అందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్నాం. నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన అన్నారు.